top of page

NLC Projects..

  • Writer: Writer Desk
    Writer Desk
  • Jan 31
  • 1 min read

*నేవేలీ లిగ్నయిట్ కార్పొరేషన్ (ఎన్ఎల్‌సీ) ప్రాజెక్టులపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి సమీక్షకు సంబంధించిన పత్రికా ప్రకటన.*


కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి బుధవారం చెన్నైలో.. నేవేలీ లిగ్నయిట్ కార్పొరేషన్ (NLC) పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ప్రసంగం ముఖ్యాంశాలు.


2047 నాటికి వికసిత భారత్ గా అభివృద్ధి చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ విజన్ లో భాగంగా కేంద్ర బొగ్గు, గనుల మంత్రిత్వ శాఖలో పలు సంస్కరణలు తీసుకొచ్చాం. దేశంలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటైన NLC ద్వారా జరుగుతున్న పనిని అభినందిస్తున్నాను. లిగ్నయిట్ ఉత్పత్తిని పెంచడంతోపాటుగా.. దేశంలో పునరుత్పాదక విద్యుత్ (రెన్యూవబుల్ ఎనర్జీ) ను ప్రోత్సహించే దిశగా NLC ద్వారా జరుగుతున్న ప్రయత్నం ప్రశంసనీయం. దేశవ్యాప్తంగా 1 గిగావాట్ పునరుత్పాదక శక్తి ఉత్పత్తి చేసిన మొట్ట మొదటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ NLC.


ఒడిశాలోని తాలాబిరా, మచ్చకట పాత్రపారాల్లో.. జార్ఖండ్ లోని సౌత్ పచ్వారా , నార్త్ దాదూల్లో బొగ్గు ఉత్పత్తిని సామర్థ్యాన్ని పెంచేందుకు NLC ద్వారా విశేషమైన కృషి జరుగుతోంది. తాలాబీరాలో ప్రధాని నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేసిన 3x800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణం త్వరితగతిన పూర్తవుతోంది. అలాగే రాజస్థాన్, అస్సాం, అండమాన్, నికోబార్ దీవుల్లో పునరుత్పాదక శక్తి సామర్థ్యాన్ని పెంపొదించేందుకు NLC ఆధ్వర్యంలో పనులు వేగంగా సాగుతున్నాయి.


NLC సంస్థలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్ స్కీమ్ వర్తించేలా పథకాన్ని రెండు నెలల్లో అమలు చేసే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించాను. ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆకాంక్షల మేరకు విద్యుత్ ఉత్పత్తిని గణనీయంగా పెంచడంలో NLC కు ఎల్లవేళలా బొగ్గు, గనుల శాఖ సహాయ సహకారాలు అందిస్తుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కింద NLC ద్వారా విద్య, వైద్యం, మౌలికవసతుల కల్పనలో జరుగుతున్న కార్యక్రమాలు అభినందనీయం. నెవేలీలో భారీ టౌన్ షిప్ నిర్మిచడం,లక్ష మంది నివసించేలా ఏర్పాట్లు చేయడం, 3 కోట్ల మొక్కలను నాటడం NLC సామాజిక బాధ్యతకు నిదర్శనం.


అనంతరం నేవేలీలో ‘పరంపరియం’ పేరిట NLC ఏర్పాటు చేసిన మ్యూజియంను, ‘NLCIL వింగ్స్’ మొబైల్ యాప్ ను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గనుల శాఖ అడిషనల్ సెక్రటరీ విస్మిత తేజ్, NLC CMD ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 
 
 

Comments


© Copyrights Reserved 2024 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page