డాక్టర్ జయంత్ బాలాజీ అథవాలే జన్మోత్సవం!
- Writer Desk
- May 15
- 2 min read
సనాతన సంస్థ సంస్థాపకులు సచ్చిదానంద పరబ్రహ్మ డా. జయంత్ బాలాజీ అథవాలే గారి 83వ జన్మోత్సవం!
సనాతన రాష్ట్ర శంఖనాద మహోత్సవం – రామరాజ్య సాధన వైపు వేసిన అడుగు!
15 దేశాలు అలాగే దేశవ్యాప్తంగా 25,000 మందికి పైగా హిందువులు హాజరుకానున్నారు!
సనాతన సంస్థ సంస్థాపకులు సచ్చిదానంద పరబ్రహ్మ డా. జయంత్ బాలాజీ ఆథవాలే గారి 83వ జన్మోత్సవం సందర్భంగా, అలాగే సంస్థ స్థాపనకు 25వ సంవత్సరం పూర్తి అవుతున్న రజతోత్సవ సంవత్సరాన్ని పురస్కరించుకుని, విశ్వకల్యాణార్థ రామరాజ్య సమాన సనాతన రాజ్యం స్థాపన కోసం 2025 మే 17 నుంచి 19 వరకు గోవాలో సనాతన రాష్ట్ర శంఖనాద మహోత్సవం అనే ఘనమైన వేడుక ఏర్పాటు చేయబడింది.
ఈ మహోత్సవానికి దేశభక్తులు, సన్యాసులు, మఠాధిపతులు, హిందుత్వవాదులు, ఆలోచనాపరులు, కేంద్ర మంత్రులు, అలాగే మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, గోవా, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే 25,000 మందికి పైగా సాధకులు, ధర్మప్రేమిక హిందువులు హాజరుకానున్నారు. ఇది రామరాజ్య సాధన వైపు ఒక దివ్యమైన శంఖనాదం అవుతుంది.
ఈ మహోత్సవానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి నుండి 100 మందికి పైగా సాధకులు, హిందూత్వవాదులు హాజరుకానున్నారు అని *హిందూ జనజాగృతి సమితి రాష్ట్ర సమన్వయ కర్త శ్రీ. చేతన్ గాడి చెప్పారు
డా. ఆఠవలే గారి మార్గదర్శకత్వంలో గత 25 సంవత్సరాలుగా సనాతన సంస్థ ఆదర్శవంతమైన, సంస్కారవంతమైన కొత్త తరం నిర్మాణం కోసం నిస్వార్థంగా కృషి చేస్తోంది.
ఈ రజతోత్సవ సంవత్సరం సందర్భంగా, దేశ వ్యాప్తంగా రామరాజ్య స్వరూపమైన “సనాతన రాజ్యం” కోసం సామూహిక సంకల్పం చేయబోతున్నాం. ఈ సందర్భంగా అన్ని ఆధ్యాత్మిక సంస్థలు, హిందూ సంఘాల మధ్య బంధుత్వం మరింత బలపడుతుంది. దేశం ఎదుర్కొంటున్న అంతర్గత, బాహ్య సవాళ్లను అధిగమించాలంటే సనాతన ధర్మం, దాని విలువలు మరియు సంరక్షణ అత్యంత అవసరం. గోమాత, గంగా, గాయత్రీ, దేవాలయాలు, వేదములు మొదలైనవాటికి తిరిగి గౌరవం కల్పించే “సనాతన రాజ్యం” స్థాపన కోసం ఈ మహోత్సవం నిర్వహించబడుతుంది.
గోవాలో జరిగే ఈ మహోత్సవం ధర్మం మరియు ఆధ్యాత్మికతతో కూడిన జ్ఞానగంగగా ప్రవహించనుంది.
ఈ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ గారు, పతంజలి యోగ్ పీఠ్ వ్యవస్థాపకులు ప.పూ. యోగర్షి స్వామి రామదేవ్ గారు, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర న్యాస్ కోశాధికారి ప.పూ. స్వామి గోవిందదేవ్ గిరి గారు, ‘సనాతన బోర్డు’ స్థాపకులు పూజ్యశ్రీ దేవకీనందన్ ఠాకూర్ మహారాజ్, కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయిక్ గారు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు, మహారాష్ట్ర సీఎం శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారు, ఉపముఖ్యమంత్రి శ్రీ ఏకనాథ్ శిండే గారు, గోవా సీఎం డా. ప్రమోద్ సావంత్ గారు, ఛత్తీస్గఢ్ సీఎం శ్రీ విష్ణుదేవ్ సాయ్ గారు, తెలంగాణలోని బీజేపీ ఎమ్మెల్యే టీ. రాజాసింగ్ గారు, అలాగే కాశీ-మథురా ఆలయాల కేసు నడుపుతున్న న్యాయవాది విష్ణు జైన్ గారిని కూడా ఆహ్వానించబడింది.
*తెలంగాణ నుండి నారాయణపేట అంబాత్రేయ క్షేత్ర పీఠాధిపతులు శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి, తెలంగాణ సదుపరిషత్ అధ్యక్షులు శ్రీ. శంకర్ స్వామి, కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ. వెంకట రమణ రెడ్డి గారు పాల్గొంటున్నారు*
మహోత్సవం యొక్క ప్రత్యేకతలు
17మరియు 18 మే రెండు రోజులు స్వామిజీల మార్గదర్శనం అలాగే హిందూ సంస్థల జాతీయ స్థాయి నాయకుల మార్గదర్శనం ఉంటుంది.
రామరాజ్యం స్థాపన కొరకు 1 కోటి రామ నామ జప యజ్ఞం చేయబోతున్నాము.
19 మే రోజున మహా ధనవంతరి యజ్ఞం ఉంటుంది
*ధర్మం కోసం తమ జీవితాన్ని పణంగా పెట్టిన వారికి “హిందూ రాష్ట్ర రత్న అలాగే ధర్మయోధులకు ధర్మశ్రీ” అవార్డు ఇవ్వడం జరుగుతుంది*
*ప్రాచీన యుద్ధ కలలు అలాగే యుద్ధాయ కృత నిశ్చయహ* అనే విషయం మీద ఒక నాటిక ప్రదర్శన ఉంటుంది

*ఈ మహోత్సవంలో గోవా ప్రాంతానికి చెందిన జనకళల ప్రదర్శన ఉంటుంది*. అలాగే *ఛత్రపతి శివాజీ మహారాజు కాలానికి చెందిన పురాతన ఆయుధాలు, సనాతన సంస్కృతి, ఆర్ట్, ఆయుర్వేదం, ఆధ్యాత్మిక వస్తువులు మొదలైన వాటి ప్రదర్శన కూడా నిర్వహించబడుతుంది.*
Comments