top of page

సనాతన రాజ్య శంఖానాద మహోత్సవం..!

  • Writer: Writer Desk
    Writer Desk
  • May 17
  • 2 min read

సనాతన రాజ్య శంఖనాద మహోత్సవం,

సనాతన రాజ్యమునకు జై, అనే గర్జనలతో హిందుత్వనిష్టులు గోవా వైపు ప్రయాణం!

*ప్రధాన అతిథిగా* ప.పూ. స్వామి గోవింద దేవి గిరి మహారాజ్, పూజ్య శ్రీ దేవకీనందన్ ఠాకూర్ మహారాజ్ మరియు సద్గురు బ్రహ్మాశేనంద ఆచార్య స్వామీజీలు మరియు గోవా ముఖ్యమంత్రి శ్రీ. ప్రమోద్ సావంత్ పాల్గొన్నారు.

మానవజాతి యొక్క పరమ శ్రేయస్సు మరియు రామరాజ్య స్థాపన కోసం శ్రమిస్తున్న సనాతన సంస్థ యొక్క స్థాపకులు సచ్చిదానంద పరబ్రహ్మ డాక్టర్ జయంత్ బాలాజీ ఆఠవలే జీ 83వ జయంతి మహోత్సవం మరియు సనాతన సంస్థ యొక్క రజతోత్సవ సంవత్సరం సందర్భంగా ఫొండా-గోవాలో మే 17 నుంచి 19 వరకు ‘సనాతన రాజ్యం శంఖనాద మహోత్సవం’ ప్రారంభమయ్యింది.


ఈ మహోత్సవం ఫర్మాగుడీ, ఫొండాలో గల గోవా ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో జరుగుతోంది.


ఈ మహోత్సవంలో పాల్గొనటానికి దేశ- విదేశాలలోని సనాతన సంస్థ సాధకులు, హిందూ ధర్మభక్తులు మరియు హిందుత్వనిష్టులు ‘సనాతన రాజ్యం’ గర్జనలతో వాహనాలలో గోవా వైపు బయలుదేరి వెళ్లారు. అందరూ హిందుత్వనిష్టులు కాశాయ రంగు టోపీలు ధరించి, వాహనాలు / బస్సులు / రైలు / విమానాలలో కాశాయ పతాకాలు ఆవిష్కరించడంతో చుట్టుపక్కల ప్రాంతమంతా చైతన్యం మరియు శక్తితో నిండిపోయింది.


ఈ సందర్బంగా స్వామి గోవింద దేవి గిరి మహారాజు మాట్లాడుతూ, 25 సంవత్సరాలు ముందు సనాతన సంస్థ స్థాపించినప్పుడే గురుదేవులు హిందూ రాజ్య స్థాపన చేయాలని సంకల్పించారు, ఆరోజునే అది స్థాపించబడింది. ఇప్పుడు ఆ సంకల్పము కార్యరూపం దాల్చిన దానికి ఎట్టి సందేహం లేదు. సనాతన రాజ్య స్థాపన కోసం మనసులోని ఉన్న వికల్పములను తొలగించుకోవాలి, అప్పుడే సనాతన రాజ్య స్థాపన కార్యరూపం దాల్చుతుంది. సనాతన ధర్మంలో చెప్పిన నియమాలు ఎన్ని సమంజసమైనవి, అందుకే వాటిని ఎప్పుడూ మార్చలేం. సనాతన ధర్మం ఒకటే జ్ఞానాన్ని పంచడానికి వెళ్ళింది. పరమాత్మ మనకి ఇచ్చిన దాన్నని పరమాత్మకే సమర్పిస్తూ ధర్మస్థాపన కోసం ప్రయత్నం చేయాలి. హిందూదేశ స్థాపన కోసం సనాతన సంస్థ అందరినీ ప్రేరేపించింది. సనాతన సంస్థ తన కార్య మూలమును ఆధ్యాత్మిక శక్తితో జోడించడం వలన కార్యము విజయవంతం అవుతుంది. సనాతన సంస్థ కార్యమును దేశంలోని సాధుసంతులందరూ ఆచరించాలి, పాటించాలి, దేశమంతటా వ్యాపింప చేయాలని ఆయన కోరారు. హిందూ దేశం కోసం స్వయంగా చట్టము చేయవలసిన అవసరం ఉందని ఆయన కోరారు. వక్ఫ్ బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు, అది వ్యతిరేకించిన వారిలో 200 మంది హిందువులే ఉన్నారు.


సనాతన సంస్థ మార్గదర్శక- ప్రవక్త అయిన సద్గురు డాక్టర్ చారుదత్త పింగళే మాట్లాడుతూ, మనదేశంలో గోహత్య గురించి, ధర్మం మీద జరుగుతున్న దాడులకు పోరాటం చేయవలసి రావడం సిగ్గుచేటు అని అన్నారు. ఇది ఎక్కడి లౌకిక వాదం అని ప్రశ్న వేశారు. ధర్మ రక్షణకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ బూనాలని చెప్పి, 'ధర్మస్థాపనకు కొరకు తమ తరపు నుండి ధనము, తనవు, మనసులను త్యాగం చేస్తాము' అని అక్కడికి వచ్చిన సాధకులందరికీ చేత ప్రతిజ్ఞ చేయించారు.

•••••••••

 
 
 

Comments


© Copyrights Reserved 2024 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page